ఆంధ్రప్రదేశ్‌

వచ్చే నెల్లో వైకాపా ప్లీనరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వచ్చే నెల 8, 9 తేదీల్లో ప్లీనరీ నిర్వహించనున్నది. పార్టీ అధ్యక్షుడు, ఎపి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఎంపీలు విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్థసారథి, వెల్లంపల్లి శ్రీనివాస్, లేళ్ళ అప్పిరెడ్డి, టి. రఘురాం పాల్గొన్నారు. ప్లీనరీని విజయవాడలో నిర్వహించే అవకాశం ఉంది. ప్లీనరీని విజయవంతం చేసేందుకు వివిధ కమిటీలు నియమించాలని నిర్ణయించారు. ప్లీనరీ ఏర్పాట్లపై వారు క్షుణ్ణంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నంలో జరిగిన భూ కుంభకోణాలపై 22న విశాఖలో మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మహాధర్నాలో జగన్ పాల్గొంటారు.