ఆంధ్రప్రదేశ్‌

పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జూన్ 20: వేసవిని తలపించేలా ఉదయం 9 గంటల నుండి ఒంటి గంట వరకు ఎండ తీవ్రతతో జనాన్ని భయపెట్టిన మంగళవారంనాటి వాతావరణం ఒక్కసారి మారిపోయింది. భారీ వర్షానికి పిడుగులు తోడు కావడంతో జిల్లాలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఎచ్చెర్ల మండలం ముద్దాడ పంచాయితీ రుప్పపేటకు చెందిన జయమ్మ(40) మేకలు మేపుతుండగా పిడుగుపడి అక్కడికక్కడే మృతిచెందింది. రేగిడి మండలం చినలింగాలవలసకు చెందిన సీర దమయంతి(45) వరి విత్తనాలు చల్లి ఇంటికి వస్తుండగా పిడుగుపాటుకు గురై ప్రాణాలు విడిచింది. అదే మండలం పెదలింగాలవలసకు చెందిన పట్నాన రాములమ్మ(50) పశువుల మేతకు గడ్డి కోస్తుండగా పిడుగుపడటంతో దుర్మరణం పాలైంది. కొత్తూరు మండలం దాసరథీపురం గ్రామానికి చెందిన రుగడ అప్పారావు(55) పొలంలో ఆవులు మేపుతుండగా పిడుగుపాటుకు గురై మరణించాడు.