ఆంధ్రప్రదేశ్‌

జగన్ వస్తేనే అభివృద్ధి: రోజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూన్ 20:రాబోయే కాలంలో 30 సంవత్సరాలపాటు జగన్ పాలన రాష్ట్రంలో రానుందని వైకాపా రాష్టమ్రహిళా అధ్యక్షురాలు, నగరి శాసన సభ్యురాలు ఆర్‌కె రోజా జోస్యం చెప్పారు. వైకాపా ప్రకాశం జిల్లా ప్లీనరీ సమావేశం మాజీ మంత్రి బాలినేని అధ్యక్షతన ఒంగోలులో మంగళవారం జరిగింది. ఈ ప్లీనరీకి ముఖ్యఅతిధిగా హాజరైన రోజా మట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని అన్నివర్గాల ప్రజలు కోరుకుంటున్నట్లు తెలిపారు. బాహుబలి సినిమాలో బాహుబలినిచూసి బల్లాలనాయుడు ఎలా భయపడతాడో అదేవిధంగా జగన్ అనే బాహుబలిని చూసి చంద్రబాబు గుండెల్లో వణుకుపుడుతోందని ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రైతులు, అన్నివర్గాల ప్రజలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఆరువందలహామీలు ఇచ్చి ఏఒక్క హామీ కూడా అమలుచేయలేదని విమర్శించారు. ఈ ప్లీనరీలో వైసిపి రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే జిల్లాలోని 12 అసెంబ్లీ స్ధానాలు, రెండు ఎంపి స్థానాలు వైకాపా గెలుపొందటం ఖాయమనిపిస్తుందన్నారు. ఈ సమావేశంలో నెల్లూరు పార్లమెంటుసభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఒంగోలు పార్లమెంటుసభ్యులు వైవి సుబ్బారెడ్డి, వైకాపా రాష్టస్రలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, వైకాపా జిల్లాపరిశీలకులు గోవిందరెడ్డితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.