ఆంధ్రప్రదేశ్‌

జగన్ ధర్నా హాస్యాస్పదం: సోమిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 20: సిబిఐ నమోదు చేసిన 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్న ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖలో మహాధర్నాకు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం నెల్లూరులో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ విశాఖలో జరిగిన భూముల టాంపరింగ్ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే కారకులపై తగిన చర్యలు తీసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎవర్ని ఉపేక్షించబోనని హెచ్చరించారని గుర్తు చేశారు. సమర్ధుడైన అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశారని, త్వరలోనే నివేదిక కూడా రానుందని తెలిపారు. అయితే ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి మాత్రం ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతుండడం మరీ విడ్డూరంగా ఉందన్నారు.