ఆంధ్రప్రదేశ్‌

సిబిఐ అంటే బాబుకు భయం: బొత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 20: విశాఖ భూ కుంభకోణంపై సిబిఐ విచారణకు బాబు భయపడుతున్నారని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొత్సా సత్యనారాయణ అన్నారు. చిత్తూరు జిల్లా వైకాపా ప్లీనరీ సమావేశంలో బొత్సా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ భూ కుంభకోణానికి సంబంధించిన రికార్డులు హుద్‌హుద్ తుఫాన్‌లో కొట్టుకుపోయాయని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సిబిఐ విచారణ అయితే ఆలస్యమవుతుందని, అందుకే సిట్ వేశామని చెప్పడం అబద్ధమన్నారు. ఈభూ కుంభకోణంలో స్వాహా చేసింది, అరిగించుకునింది అంతా టిడిపి వారేనని, వారిపేర్లు బయటపడకుండా ఉండేందుకే సిట్ చేత దర్యాప్తు చేయిస్తున్నారన్నారు. అబద్ధాలు చెప్పి అక్రమంగా అధికారం చేజిక్కించుకున్న చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో ప్రజాకంఠక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. గాడి తప్పిన పాలన గాడిలో పడాలంటే వై ఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఒక్కటే మార్గమన్నారు. తమది రాజకీయ పార్టీ అని అందుకే అధికారపార్టీ తప్పులను ఎత్తిచూపుతూ, అడుగడుగునా ప్రశ్నిస్తూ, ప్రజల బాధలపై స్పందిస్తున్నామన్నారు.