ఆంధ్రప్రదేశ్
అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 21 June 2017
హైదరాబాద్, జూన్ 20: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఎఐసిసి కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును డిమాండ్ చేశారు. నాడు మద్రాసు నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములుకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం మంచిది కాదని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలను పెట్టాలని చంద్రబాబు నిర్ణయించడం మంచిదేనని ఆయన తెలిపారు. అయితే ఆంధ్రరాష్ట్ర ఏర్పడడానికి ముఖ్య కారకుడైన పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టకపోవడం విచారకరమని అన్నారు. కాబట్టి ఈ విషయంలో చంద్రబాబు ఆలోచన చేయాలని ఆయన కోరారు.