ఆంధ్రప్రదేశ్
కమాండ్ అండ్ కమ్యూనికేషన్ సెంటర్ను ప్రారంభించిన సిఎం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 21 June 2017
విజయవాడ, జూన్ 20: వెలగపూడి సచివాలయంలోని సిఎం బ్లాక్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ప్రారంభించారు. స్టార్ ఆఫ్ ఫంక్షన్ను పూజాదికాలతో లాంఛనంగా ఆయన ప్రారంభించారు. త్వరలో ఏర్పాటు కానున్న స్టేట్ కమాండ్ అండ్ కమ్యూనికేషన్ కార్యాలయం (ఇంటిగ్రేటెడ్ డేటాబేస్ ఫర్ రియల్ గవర్నెన్సు) నుంచి రాష్ట్రంలో ప్రాజెక్జుల పనులను ప్రత్యక్ష ప్రసారం ద్వారా సిఎం పర్యవేక్షించే సౌకర్యం ఈ కేంద్రంలో ఉంటుంది. రాష్ట్ర కమాండ్ అండ్ కమ్యూనికేషన్ కేంద్రానికి అనుగుణంగా జిల్లాల్లో 10 కమాండ్ అండ్ కమ్యూనికేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. సిఎం బ్లాక్లోని కేంద్రంలో వివిధ శాఖల అధికారులు సిఎంకు అందుబాటులో ఉంటారు.