ఆంధ్రప్రదేశ్
పాస్పోర్టు వెరిఫికేషన్లో ఏపి పోలీసుకు కేంద్ర పురస్కారం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 24 June 2017
విజయవాడ (క్రైం), జూన్ 23: పాస్పోర్టుల జారీలో కీలకమైన వెరిఫికేషన్ సేవల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం అత్యున్నత సేవలు అందించినందుకు కేంద్ర పురస్కారం దక్కింది. దేశంలోనే ఏపి పోలీసు అగ్రగామిగా నిలిచింది. దీనికి గుర్తింపుగా ఏపి పోలీసుకు కేంద్ర ప్రభుత్వ పురస్కారం ప్రకటించడంతో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ చేతుల మీదుగా రాష్ట్ర ఇంటిలిజెన్స్ అదనపు డిజి ఏబి వెంకటేశ్వరరావు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఆన్లైన్ సేవల ద్వారా పాస్పోర్టు వెరిఫికేషన్ను ఏపి పోలీసు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలు మన్ననలు పొందింది.
చిత్రం.. అవార్డు స్వీకరిస్తున్న ఇంటిలిజెన్స్ అదనపు డిజి వెంకటేశ్వరరావు