ఆంధ్రప్రదేశ్‌

నీటికుంటలో పడి తోడికోడళ్లు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూన్ 25: బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తూ తోడికోడళ్లు నీటికుంటలో పడి మృతిచెందిన సంఘటన ఆదివారం అనంతపురం జిల్లా మడకశిర మండలం సి.కొడిగేహల్లి గ్రామంలో చోటుచేసుకుంది. సి.కొడిగేహల్లి గ్రామానికి చెందిన అన్నదమ్ములైన నరసింహమూర్తి, కొల్లారప్ప భార్యలు అరుణ (25), సింధు (22).
వీరు ఉదయం బట్టలు ఉతకడానికి గ్రామ శివారులోని నీటి కుంట వద్దకు వెళ్లారు. అయితే బట్టలు ఉతుకుతున్న సమయంలో దుస్తులు తీసుకెళ్లిన బుట్ట నీటిలోకి పడిపోవడంతో దానిని అందుకోవడానికి వెళ్లిన అరుణ కాలుజారి నీటిలోకి పడిపోయింది. ఆమెను రక్షించబోయిన సింధు సైతం నీటిలో మునిగిపోయింది. బట్టలు ఉతకడానికి వెళ్లిన వారు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో వారి భర్తలు నీటి కుంట వద్దకు వెళ్లి చూడగా ఇద్దరూ నీటికుంటలో బురదలో ఇరుక్కుని శవమై కనిపించారు.