ఆంధ్రప్రదేశ్‌

బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాయుడుపేట, జూలై 4:వికలాంగురాలైన బాలికపై మద్యం మత్తులో ఇద్దరు యవకులు అత్యాచారం జరిపిన సంఘటన నెల్లూరు జిల్లా నాయుడు పేట పట్టణ పరిధిలోని మునిరత్నంనగర్ కాలనీలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. మునిరత్నంనగర్ కాలనీలో ఉన్న ఒక మైనర్ బాలిక పుట్టుకనే వికలాంగురాలు. పోలియో వ్యాధిగస్తురాలు. తండ్రి మృతి చెందడంతో తల్లి పలు ఆసుపత్రుల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. కాశికిరణ్, హరిబాబు అనే యువకులు మూడు రోజుల క్రితం పూటుగా మద్యం సేవించి మత్తులో ఉండగా వాటి కంటపడిన మైనర్‌బాలికను అదే ప్రాంతంలోని ఖాళీగా ఉన్న ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడారు. అలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటనతో రెవెన్యూ, పోలీసు అధికారులు విచారించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈమేరకు సిఐ రత్నయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.