ఆంధ్రప్రదేశ్‌

మార్నింగ్ వాకర్స్ పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 16: కృష్ణా జిల్లా పెడన శివారు కొంకేపూడి వద్ద ఆదివారం ఆర్టీసీ బస్సు అదుపు తప్పి మార్నింగ్ వాకర్స్ పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పెడనకు చెందిన పండ్ల వ్యాపారి వడ్డి రామకృష్ణ(59) అక్కడిక్కడే మృతి చెందాడు. 3వ వార్డు కౌన్సిలర్ బూసం ఆనందరావు, సిటీకేబుల్ నిర్వాహకుడు మలిరెడ్డి రామకృష్ణారెడ్డి, బొడ్డు ఆనందరావు అనే ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మచిలీపట్నం, విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. ఉదయం 6.30కి మచిలీపట్నం నుండి రాజమండ్రికి బయలుదేరిన ఆర్టీసీ బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మార్నింగ్ వాకర్స్ పైకి దూసుకెళ్లింది. పెడన నుండి నడుపూరు వరకు ఉదయపు నడకకు వెళ్లిన సుమారు 8 మంది పెడన వాసులు తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు తమవైపు దూసుకొస్తుండటాన్ని గమనించిన కొందరు వాకర్స్ తప్పించుకోగలిగారు. పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్ క్షతగాత్రులను పరామర్శించారు. బందరు డిఎస్పీ శ్రావణకుమార్ ఘటనా స్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.