ఆంధ్రప్రదేశ్
ప్రాణం తీసిన ‘సెల్ఫీ’
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 17 July 2017
విజయనగరం, జూలై 16: వినోదం ఓ విద్యార్ధి ప్రాణాన్ని బలిగొంది. సరదాగా అరకు చూద్దామని ఆరుగురు స్నేహితులతో బయలుదేరిన ఓ విద్యార్థి సెల్ఫీ తీసుకుంటూ రైల్లోనుంచి జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరుకు చెందిన దేశరెడ్డి గోపిరెడ్డి (21) స్నేహితులతో ఆదివారం ఉదయం కిరండల్ రైల్లో అరకు బయలుదేరాడు. ఉదయం 10.30 గంటల సమయంలో సిమిలిగుడా రైల్వే స్టేషన్ పరిధిలోని కరకవలస వద్ద రైలునుంచి జారిపడి మృతిచెందాడు. దీనిపై రైల్వే జిఆర్పి ఎస్సై శ్రీనివాసరావు మాట్లాడుతూ గోపిరెడ్డి సెల్ఫీ తీసుకుంటూ జారిపడి మరణించాడని తెలిపారు. గుంటూరులో బి.్ఫర్మసీ చదువుతున్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.