ఆంధ్రప్రదేశ్‌

నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసే నేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 17: నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం పనిచేసే వ్యక్తి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. ఉప రాష్టప్రతిగా వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వం ఖరారు చేయడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఆయన అభినందనలు తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో సిఎం మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే పోరాట యోధుడిగా ఉన్నారన్నారు. 1978లో తామిద్దరం ఒకేసారి అసెంబ్లీలోకి ప్రవేశించామన్నారు. ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గజగజలాడించారన్నారు. ఆగస్టు సంక్షోభ సమయంలో ఎన్టీఆర్‌కు వెన్నుదన్నుగా నిలిచి, ప్రజాస్వామ్య పరిరక్షణకు విశేషంగా కృషి చేశారన్నారు. దేశ రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత తనదైన శైలిలో జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. 1999 వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంకయ్యనాయుడు, 2002లో బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారన్నారు. 2014 ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. వెంకయ్యనాయుడికి ప్రత్యేక గుర్తింపు నిచ్చారన్నారు. పదేళ్లపాటు రాజ్యసభ సభ్యునిగా వ్యవహరించిన వెంకయ్యనాయుడు ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన పాత్ర పోషించారన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపి కష్టాలను రాజ్యసభలో గొంతెత్తిన ఏకైక వ్యక్తి వెంకయ్యనాయుడు అని అన్నారు. విభజన తరువాత కూడా రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఎన్డీయే తరపున ఉప రాష్టప్రతి అభ్యర్థిగా ఎంపిక కావడంపై వెంకయ్యనాయుడికి సిఎం చంద్రబాబునాయుడు ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపర్చిన ప్రధాని నరేంద్రమోదీకి, ఎన్డీయే మిత్రపక్షాలకు అభినందనలు తెలిపారు. ఉప రాష్టప్రతి పదవికి ఆయన తగిన వ్యక్తి అని కొనియాడారు. ఉప రాష్టప్రతిగా ఉంటూ రాజకీయాలు మాట్లాడలేకపోయినా ఏపి అభివృద్ధికి మాత్రం అయన నిరంతరం కృషి చేస్తారనే ఆశాభావాన్ని సిఎం చంద్రబాబు వ్యక్తం చేశారు. మనకు ఎన్ని కష్టాలున్నా ఒక వ్యక్తి ఉన్నతస్థానానికి చేరుకుంటున్నప్పుడు స్వాగతించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆయన ఏ పదవిలో ఉన్నా వనె్న తెస్తారన్నారు. వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వంపై అమిత్‌షా తనతో ఫోన్‌లో మాట్లాడినట్లు సిఎం చంద్రబాబు తెలిపారు.
మంత్రిమండలి సమావేశం వాయిదా
మంగళవారం జరగాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా వేస్తున్నట్లు సిఎం తెలిపారు. ఉప రాష్టప్రతిగా వెంకయ్యనాయుడు నామినేషన్ కోసం ఢిల్లీ వెళుతుండడంతో, మంత్రిమండలి సమావేశం వాయిదా వేసినట్లు తెలిపారు. త్వరలో సమావేశ తేదీని వెల్లడిస్తామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు, కమిషనర్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు.