ఆంధ్రప్రదేశ్‌

‘మరింత డబ్బిచ్చేవారుంటే చూడండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: సదావర్తిసత్రం భూములకు సంబంధించి మరింత పెద్ద మొత్తంలో ఎవరైనా చెల్లించేందుకు సిద్ధంగా ఉంటే చూడాలని హైకోర్టు పేర్కొంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథ్, జస్టిస్ టి రజనీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 10 కోట్ల రూపాయిలు చెల్లించి ఆ భూములను కొనుగోలు చేసేందుకు సిద్ధం కావడంతో ఇంకా ఎవరైనా ఉంటే చూడాలని న్యాయస్థానం పేర్కొంది. భూముల కొనుగోలుకు అత్యధిక మొత్తం చెల్లించేందుకు గతంలో సిద్ధపడిన బిడ్డర్ తరపున హాజరైన న్యాయవాది వైకాపా ఎమ్మెల్యేకు భూములను అమ్మడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వైకాపా ఎమ్మెల్యే ఆ భూముల విలువ వెయ్యి కోట్లు అని పేర్కొన్నారని, కనుక కనీసం 500 కోట్లు ఆయన ఇస్తేనే ఆ భూములు ఇవ్వాలని పేర్కొన్నారు. దానిపై న్యాయమూర్తులు స్పందిస్తూ మిగిలిన బిడ్డర్లు ఎవరైనా ఇంకా ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సిద్ధపడితే దానిని కూడా కోర్టు పరిశీలిస్తుందని పేర్కొన్నారు.