ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం బ్యారేజీ వద్ద గోదావరి నీరు కనబడటం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), జూలై 18: గోదావరి జలాలు ప్రకాశం బ్యారేజి వద్ద కనబడటం లేదా ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డిని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూటిగా ప్రశ్నించారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్‌ఆర్‌సిపి ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకొని తిట్టిన తిట్టు తిట్టకుండా 673 సార్లు చంద్రబాబును తిట్టారని అన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణకు వస్తే ఎందుకు మాట్లాడటం లేదని, వాస్తవం మాట్లాడటానికి అహం అడ్డువచ్చిందా అని ప్రశ్నించారు. 8.8 టిఎంసిల నీరు తీసుకువచ్చి రూ.2,500 కోట్ల విలువైన పంటను కాపాడినట్లు చెప్పారు. కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సిపి ముసుగులో కెవిపి, రఘువీరారెడ్డి, ఊసరవెల్లి ఉండవల్లి అరుణ్‌కుమార్, జగన్మోహనరెడ్డి లాంటి వారు విమర్శిస్తున్నారన్నారు. పంట కాలువల్లోకి, పొలాల్లోకి నీరు వెళుతున్నా అందరూ బురద జల్లారని మండిపడ్డారు. కృష్ణాడెల్టాలో ఆక్వా, వ్యవసాయం ఉత్పత్తుల ద్వారా ఆదాయం భారీగా పెరిగినట్లు చెప్పారు. పట్టిసీమ ఏడాదిలో పూర్తి చేస్తామంటే ఆరోజు హేళనగా మాట్లాడారని, ఏడాదిలో పూర్తయితే రాజీనామా చేస్తానని ఉరవకొండ ఎమ్మెల్యే అన్నారన్నారు. చేస్తానని చెప్పాము, చేసి చూపించామన్నారు. పులివెందులకు నీరిస్తామన్నా కూడా హేళనగా మాట్లాడారని, అయితే కుప్పం కంటే ముందే పులివెందులకు నీరిచ్చినట్లు తెలిపారు. పట్టిసీమకు వ్యతిరేకం అంటూ రైతులను రెచ్చగొట్టారని అన్నారు. సముద్రంలో కలిసే నీరుని కృష్ణా డెల్టాకు తెచ్చామని, ఆ విషయాన్ని రైతులు అర్థం చేసుకున్నారని చెప్పారు. ఆగస్టు 15కి పురుషోత్తపట్నం ద్వారా నీరిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీరు, తాగునీరు అందించడానికి వివిధ ప్రాజెక్టులపై 33వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. 26 ప్రాజెక్టుల నీటి విడుదల తేదీలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు తెలిపారు. వివిధ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు కూడా ముందుగానే పంట పొలాలకు నీరందించి, అక్కడి కష్టాలు తీరుస్తామన్నారు. రాయలసీమని రతనాల సీమ చేస్తామని, హార్టీకల్చర్ హబ్‌గా తయారుచేస్తామని చెప్పారు. ఇటుక ఇటుక పేర్చుకుంటూ ప్రతి సోమవారం పోలవారంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. నాలుగువేల మంది ఇంజనీర్లు పని చేస్తుంటే స్పిల్‌వేకు పగుళ్లు ఇచ్చినట్లు చెప్పడం ఏమిటని మండిపడ్డారు. అటు పోలవరం, ఇటు రాజధాని అమరావతి విషయంలో రైతులను రెచ్చగొడుతూ అడ్డుపడుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.