ఆంధ్రప్రదేశ్‌

మత్స్యకారులు ఏమయ్యారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యు.కొత్తపల్లి, జూలై 18: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీరం నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన అయిదుగురు మత్స్యకారుల ఆచూకీ గల్లంతయ్యింది. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ నెల 9న వీరంతా బోటుపై చేపల వేటకు వెళ్లారు. వీరు నాలుగు రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా, పది రోజులైనా రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. దీంతో కుటుంబ సభ్యులు కొత్తపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై సత్యనారాయణ ఉప్పాడ శివారు రంగంపేట, మాయాపట్నం వెళ్లి గల్లంతైన మత్స్యకారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమాచారాన్ని కోస్టుగార్డు, మెరైన్ పోలీసులకు అందజేశారు. మత్స్యకారుల కోసం గాలింపుచర్యలు చేపట్టారు. గల్లంతైన మత్స్యకారుల్లో చొక్కా అప్పారావు, రాకాని రాము, కందుల కొండయ్య, నేరుగ కృష్ణ, చేపల రాజు ఉన్నారు.