ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణ కార్పొరేషన్ ఎండిగా ఎం పద్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 20: రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఎండిగా గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎం పద్మను నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. 2004 ఐఎఎస్ కేడర్‌కు చెందిన పద్మ బ్రాహ్మణ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు.
బివి బాలయోగి,
ఇ రవీంద్రబాబులకు పదోన్నతి
విజయవాడ: గిరిజన సంక్షేమశాఖ జాయింట్ డైరెక్టర్ బివి బాలయోగి, ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు అదనపు సంచాలకులుగా పదోన్నతి పొంది విజయవాడలోని ప్రత్యేక కమిషనర్ కార్యాలయంలో అదనపు సంచాలకులుగా బాధ్యతలు చేపట్టారు. గిరిజన సంక్షేమశాఖలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఇ.రవీంద్రబాబును అదనపు సంచాలకులుగా పదోన్నతిపై ట్రైకార్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమించింది.