ఆంధ్రప్రదేశ్‌

గల్లంతైన జాలర్లు క్షేమం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 22: తూర్పు గోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన గల్లంతైన జాలర్లు క్షేమంగా ఆంధ్రా-ఒరిస్సా తీరానికి చేరుకున్నట్టు ప్రభుత్వ యంత్రాంగానికి సమాచారం అందింది. ఈనెల 10వ తేదీన సుబ్బంపేట నుండి వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్ళిన ఐదుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరు ఈనెల 16వ తేదీకి తీరానికి చేరుకోవల్సి ఉండగా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఈనెల 17వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేశాయి. దీంతో కోస్ట్‌గార్డ్ అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు. అయితే బోటు ఇంజన్ చెడిపోవడంతో ఐదుగురు జాలర్ల ఆచూకీ గల్లంతయ్యింది. ఎట్టకేలకు శుక్రవారం రాత్రి ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు తీరానికి బోటు చేరుకున్నట్టు కోస్ట్‌గార్డ్ ద్వారా సమాచారం అందినట్టు కలెక్టర్ కార్తికేయ మిశ్రా శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. సదరు జాలర్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, మత్స్యకారులను జిల్లాకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు.