ఆంధ్రప్రదేశ్‌

భూమి వార్తకు ఖండన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 24: కాపుకార్పొరేషన్‌లో భారీ స్కాం శీర్షికతో ఈనెల 21 ఆంధ్రభూమిలో వచ్చిన వార్తను జూమ్ టెక్నాలజిస్ సోమావరం నాడొక ప్రకటనలో ఖండించింది. దేశంలోనే కంప్యూటర్ నెట్‌వర్కింగ్, సైబర్ భద్రత శిక్షణలో తమ సంస్థకు ఎంతో పేరుందని ‘జూమ్’ వెల్లడించింది. గత రెండు దశాబ్దాలుగా దేశ, విదేశాల నుంచి విద్యార్థులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. భూమి వార్తకు వివరణ ఇస్తూ గోపాల్ అనే విద్యార్థి మార్చి 27న కాపుకార్పొరేషన్ ద్వారా ప్రవేశం పొంది జూమ్‌లో శిక్షణ తరగతులకు వచ్చాడని చెప్పారు. ఆరు క్లాసులకు మాత్రమే హాజరై తరువాత మానేశాడని, దీంతో అతడి పేరు, హాజరు వివరాలు కాపుకార్పొరేషన్‌కు స్టయిఫండ్ నిమిత్తం పంపలేదని సంస్థ వెల్లడించింది. అలాగే ఆ విద్యార్థికి సంబంధించి ఎలాంటి ట్యూషన్ ఫీజు, శిక్షణ రుసుము కాపుకార్పొరేషన్ నుంచి తాము పొందలేదని జూమ్ టెక్నాలజిస్ పేర్కొంది.