ఆంధ్రప్రదేశ్‌

టిడిపి, కరవు అవిభక్త కవలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంతకల్లు, జూలై 24: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని కరువు కబళిస్తుందని, టిడిపి, కరవు అవిభక్త కవలలని పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని పొట్టి శ్రీరాములు సర్కిల్‌లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ దేశంలో బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలు ప్రజలను మభ్యపెడితే, ప్రతిపక్షనేత జగన్ బిజెపి పక్షాన చేరి వారికి వంత పాడుతూ ప్రజలకు త్రీడి సినిమాలు చూపిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నంద్యాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాజాగా ప్రజలకు లెక్కలేనన్ని హామీలు గుప్పిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన దాదాపు 600 హామీలను పట్టించుకోని ముఖ్యమంత్రి నంద్యాల ప్రజలను మభ్య పెట్టెందుకు మళ్లీ కొత్త హామీలిస్తున్నారని ఆరోపించారు.