ఆంధ్రప్రదేశ్‌

నెలాఖరు వరకు ఓటరు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, జూలై 24: జూలై నెలాఖరు వరకు రాష్ట్రంలో ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. కర్నూలు జిల్లా మహానందిలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రతి ఇంటికి వెళ్లి బూత్ లెవెల్ ఆఫీసర్ల ద్వారా ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు. అదే విధంగా కళాశాలలకు వెళ్లి విద్యార్థుల ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 15 లక్షల మంది ఓటర్ల నమోదు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 42 వేల ఓటర్ల నమోదు జరిగిందన్నారు. నంద్యాలలో పది వేల మంది నూతన ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.