ఆంధ్రప్రదేశ్
విశాఖ ఐఐఎంకు నిధులు ఇవ్వండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 29 July 2017
న్యూఢిల్లీ, జూలై 28: విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యా సంస్థలకు నిధులను మంజూరు చేయాలని అమలాపురం టిడిపి ఎంపీ పి. రవీంద్రబాబు లోక్సభలో విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఐఐఎం 2017 బిల్లుపై లోక్సభలో జరగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. విభజన అనంతరం విశాఖలో ఐఐఎం ఏర్పాటు చేశారని, దానికి పూర్తిస్థాయిలో వౌలిక వసతులు కల్పించేందుకు నిధులను మంజూరు చేయాలన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా ఐఐఎంలోని ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు చాలా తక్కువశాతం మంది ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రీయ విద్యాసంస్థల్లో అధ్యాపకులను పెంచేందుకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.