ఆంధ్రప్రదేశ్‌

ఒంగోలు గిత్తలపై బ్రెజిల్ ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 28: బ్రెజిల్ దేశంలో ఒంగోలు గిత్తల పెంపకాన్ని చేపట్టే లక్ష్యంతో ఆ దేశానికి చెందిన వ్యాపార ప్రతినిధి జాస్‌తో కూడిన ప్రతినిధి బృందం శుక్రవారం వెలగపూడి అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాదరావును కలిసింది. ఈ ప్రతినిధి బృందం స్పీకర్ చాంబర్‌లో ఇందుకు సంబంధించి కొద్దిసేపు ముచ్చటించింది. ఒంగోలు జాతి ఎద్దుల పెంపకానికి ఒంగోలు గిత్తలను బ్రెజిల్ దేశంలో పెంచేందుకు ఆసక్తిని చూపుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రతినిధి బృందం ఇక్కడకు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలో బ్రెజిల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పరస్పర ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ సందర్భంగా స్పీకర్ శివప్రసాదరావు మన ఒంగోలు జాతి ఎద్దుల ప్రాముఖ్యతను వారికి వివరించారు.