ఆంధ్రప్రదేశ్
హచ్పిసిఎల్ క్రూడాయిల్ ట్యాంక్ర్పై పిడుగు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గాజువాక, జూలై 29: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ విశాఖపట్నం రిఫైనరీలోని 01బి క్రూడాయిల్ ట్యాంక్పై శనివారం రాత్రి పిడుగు పడింది. దీంతో క్రూడాయిల్ ట్యాంకులో ఒక్కసారిగా మంటలు లేచాయి. అయితే హెచ్పిసిఎల్ అధికారులు వెంటనే స్పందించి అత్యవసర అలారాన్ని మోగించడంతో అధికారులు, ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు అగ్నిమాపక శకటాలకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న హెచ్పిసిఎల్ ఫైర్ వింగ్ సిబ్బంది, షిప్యార్డ్, డాక్యార్డ్ అగ్నిమాపక శకటాల సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిన వచ్చి క్రూడాయిల్ ట్యాంకు నుండి ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేశారు. ఈలోగా మంటలు ఇతర ప్రాంతానికి విస్తరించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని హెచ్పిసిఎల్ అధికారులు తెలిపారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తరువాత నష్టాన్ని అంచనా వేస్తామని అధికారులు స్పష్టం చేశారు.