ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్‌ను కలిసిన ముఖ్యమంత్రి బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 29: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌ను శనివారం కలుసుకుని వివిధ అంశాలపై చర్చించారు. ఇక్కడ ఒక వివాహ కార్యక్రమానికి హాజరయ్యే నిమిత్తం ఆయన శుక్రవారం ఇక్కడకు వచ్చారు. గవర్నర్‌తో చంద్రబాబు రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఏపి ప్రభుత్వ అమలు చేయనున్న ఈ-ప్రగతి గురించి ఆయన గవర్నర్‌కు వివరించారు. రాష్ట్రంలో ఐటి రంగం అభివృద్ధి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆగస్టు 15వ తేదీన ఈ సారి తిరుపతిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణం పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు ప్రణాళికను కూడా ఖరారు చేసిన విషయాలను గవర్నర్‌కు తెలిపినట్లు సమాచారం. ఈ సమావేశం దాదాపు గంటకుపైగా జరిగింది.