ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడకు మద్దతుగా ఢిల్లీలో కాపుల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 30: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభానికి మద్దతుగా ఢిల్లీలోని ఆంధ్రాభవన్ వద్ద ఢిల్లీ కాపు సంక్షేమ సంఘం నిరసన చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తున్న కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడను గృహనిర్భంధం చేయడం పట్ల సంఘం మండిపడింది. కాపు నాయకులు సుమంత్, సత్యనారాయణ మాట్లాడుతూ 2014 ఎన్నికల సందర్భంగా కాపులకు బీసీ హోదా కల్పిస్తానని, ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కాపు సంక్షేమానికి వెయ్యికోట్ల రూపాయిలు మంజూరు చేస్తామని ఇచ్చిన హామీలను విస్మరించారని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను అమలుచేయాలని ప్రశ్నించిన ముద్రగడ, కాపులపై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. కాపు ఓట్లతో అధికారంలోకి వచ్చి అవసరం తీరాక వారిని పక్కన పెట్టేశారని చంద్రబాబుపై మండిపడ్డారు. ఈ నిరసన కార్యక్రమానికి దళిత సంఘాలు, దళిత నాయకుడు అనందరావు సంఘీభావం తెలిపారు.