ఆంధ్రప్రదేశ్‌

నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి,జూలై 30: నీటి కుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన ఆదివారం ప్రకాశం జిల్లా దర్శి మండలంలోని తూర్పువెంకటాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వీరపనేని చంద్రశేఖర్ (13), వేగినేటి నారాయణస్వామి (14) ఆదివారం కావటంతో మరో బాలుడితో కలిసి తమపొలాల్లోని నీటికుంటలో గొర్రెలను కడిగేందుకు వెళ్లారు. గొర్రెలను కడుక్కున్న తర్వాత ఈతకొట్టాలని సరదాగా నీటి కుంటలో దిగారు. ముందుగా నీటికుంటలో దిగిన చంద్రశేఖర్, నారాయణస్వాము కొట్టుకుంటూ నీళ్లల్లో మునిగిపోవటంతో ఒడ్డున ఉన్న మరో బాలుడు భయంతో పరారు అయ్యాడు. గొర్రెలు తొలుకుని వెళ్లినవాళ్లు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో నీటికుంట వద్దకు వెళ్ళటంతో ఒడ్డున బట్టలు కనబడి పిల్లలు కనపడకపోవటంతో గ్రామస్థుల సహకారంతో నీటి కుంటలో వెదికారు. నీటికుంటలో వారిద్దరి మృతదేహాలు బయటకుతీశారు. పరారు అయిన మూడోబాలుడు కనిపించటంతో తల్లిదండ్రులు ఊపిరీపీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సుబ్రమణ్యం సంఘటన స్ధలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.