ఆంధ్రప్రదేశ్‌

3నుంచి తిరుమలలో పవిత్రోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 31: తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 3 నుంచి పవిత్రోత్సవాలను టిటిడి వైభవంగా నిర్వహించనుంది. బుధవారం అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో భక్తుల వల్లగానీ, సిబ్బంది వల్లగాని తెలిసి, తెలియక జరిగే దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం ఈ పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు ఉదయం 9 గంటలకు స్నపన తిరుమంజనం, సాయంత్రం భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. 3న పవిత్రాల ప్రతిష్ట, 4న పవిత్ర సమర్పణ, 5న పూర్ణాహుతి నిర్వహిస్తారు. ఆగస్టు 2వ తేదీన నిర్వహించే వసంతోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు, 3న నిర్వహించే తిరుప్పావడ సేవ, నిజపాద దర్శనం, కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, వసంతోత్సవ సేవ, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేశారు. ఈ మూడు రోజుల్లో అర్చన, తోమాల సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు.