ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలో చేరిన నంద్యాల నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 1: కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలంలోని దీపగుంట్ల గ్రామానికి చెందిన ఇసుకపల్లి మహేశ్వరరెడ్డి, ఈశ్వరరెడ్డి, వర్థన్‌రెడ్డి, శ్రీ్ధర్‌రెడ్డి, రాంరెడ్డి, మాజీ మండల కమిటీ కన్వీనర్ వేమారెడ్డి, వెంకటరెడ్డిలతో పాటు మరో 40 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరందరికీ చంద్రబాబు శాలువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వీరంతా సిరివెళ్ల మండలం తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కాటంరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, కామినేనిపల్లి సర్పంచ్ రాంభూపాల్‌రెడ్డి, సుధారామ ఆధ్వర్యంలో బాబును విజయవాడ క్యాంపు కార్యాలయంలో కలిశారు. నంద్యాల నియోజకవర్గ తెలుగుదేశం విజయానికి కృషి చేస్తామని వారంతా హామీ ఇచ్చారు.