ఆంధ్రప్రదేశ్‌

ఇసికి ఫిర్యాదు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 3: నంద్యాల ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి చేసిన తీవ్ర విమర్శలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర రెడ్డి తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం అనంతరం గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ వాడిన భాష, ఆయన నేర ప్రవృత్తిని తెలియచేస్తోందన్నారు. ప్రతిపక్ష నేత అయినా, భాష మారలేదనడానికి ఇది నిదర్శమన్నారు. ఇప్పుడు జగన్ వినియోగిస్తున్న భవనాలన్నీ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉండగా సంపాదించినవేనని ఆరోపించారు. ఆపరేషన్ ఆకర్ష్‌ను వైఎస్సే తొలుత ప్రారంభించారని గుర్తు చేశారు. ఇచ్చిన మాటపై మడమ తిప్పనని చెప్పే జగన్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఎంపీలతో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నామన్నారు.