ఆంధ్రప్రదేశ్‌

పూర్తయిన పనులకు వెంటనే బిల్లులు ఇవ్వండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 14: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తయిన పనుల మేరకు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. సోమవారం ఉదయం తన నివాసంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో పురోగతిపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. పనుల విషయంలో అలసత్వాన్ని అసలు సహించనని ఆయన అధికారులు, కాంట్రాక్టర్లను ఉద్దేశించి చెప్పారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు జరగాలని అన్నారు. ప్రణాళిక ప్రకారం పనులు సాగితేనే చెప్పిన సమయంలోగా పోలవరం ప్రాజెక్టు నుండి గ్రావిటీతో నీళ్లు ఇవ్వగలుగుతామని చెప్పారు. పనుల విషయంలో అలసత్వం ప్రదర్శించే సిబ్బంది విషయంలో కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడవద్దని చెప్పారు. పోలవరం పనులను సవాల్‌గా తీసుకుని పూర్తిచేయడంలోనే ఇంజనీర్ల సమర్థత బయటపడుతుందని అన్నారు. సమావేశంలో జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు.