ఆంధ్రప్రదేశ్‌

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రుపాలెం, ఆగస్టు 15: తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని మామునూరు గ్రామానికి చెందిన దంతాల భవాని మంగళవారం ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగబిడ్డ వున్నారు. ఉదయం పురిటినొప్పులు రాగా వెంటనే కృష్ణాజిల్లా తిరువూరులో ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకొనివెళ్ళారు. హాస్పిటల్‌లో నలుగురు పిల్లలకు జన్మనిచినట్లు భవాని భర్త రామకృష్ణ తెలిపాడు. మధ్యాహ్నానికి ముగ్గురు ఆడపిల్లలు మృతి చెందగా, మగ పిల్లాడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు తండ్రి తెలిపారు.