ఆంధ్రప్రదేశ్‌

అనంతలో మెడికో ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 17 : అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో మొదటి సంవత్సరం ఎంబిబిఎస్ చదువుతున్న యశ్వంత్ గురువారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చదువుకునేందుకు తన తల్లిదండ్రులు ఎంతోప్రోత్సహమిచ్చారని, కానీ ఈ లోకంలో తాను మనుగడ సాగించలేనని రాసిన సూసైడ్ నోట్‌ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం నగరంలో ఉంటున్న చంద్రశేఖర్, సుమతి దంపతుల కుమారుడైన యశ్వంత్ ఈ ఏడాది అనంతపురం మెడికల్ కాలేజీలో చేరాడు. వైద్య పరీక్షల్లో భాగంగా గురువారం ఫిజియాలజీ పేపర్-2 పరీక్ష రాయాల్సి ఉంది. ఈ తరుణంలో ఆత్మహత్య చేసుకోవడం చర్చనీయాశంగా మారింది. చదువులో ఒత్తిడి కారణంగా రాణించలేక పోవడంవల్లే యశ్వంత్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందని ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు తెలిపారు. అనంతపురం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.