ఆంధ్రప్రదేశ్‌

ముద్రగడను నమ్మితే 30 ఏళ్లు వెనక్కి: రాజప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 17: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చెబుతున్న మాటలు నమ్మితే మరో 30 ఏళ్లు వెనక్కి పోతారని రాష్ట్రంలోని కాపు సామాజికవర్గాన్ని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. ముద్రగడ చెప్పే తప్పుడు మాటలు నమ్మవద్దని కోరారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కిమిడి కళావెంకట్రావుతో కలసి గురువారం కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల మ్యానిఫెస్టోను ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చినరాజప్ప విలేఖరులతో మాట్లాడుతూ కాపులను ఆదుకునే ఏకైక ప్రభుత్వం తెలుగుదేశమేనని, ఒక్క చంద్రబాబు మాత్రమే కాపులకు న్యాయం చేయగలరని వ్యాఖ్యానించారు. నంద్యాల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపికి అవకాశం ఇస్తే దౌర్జన్యం, హింసావాదం, అరాచకాలు పేట్రేగిపోతాయన్నారు. కాకినాడ ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని పేర్కొన్నారు. కాకినాడ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించాల్సిందిగా హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, నగర అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషిచేసిందన్నారు. మంత్రి కిమిడి కళావెంకట్రావు మాట్లాడుతూ కార్పొరేషన్‌లో గెలిచే వారికే టిక్కెట్లు ఇచ్చామన్నారు. నగర ప్రజలు అభివృద్ధికే ఓటేస్తారని, అభివృద్ధికే పట్టం కడతారన్నారు. అభివృద్ధి కావాలో, అరాచక పాలన కావాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. ముఖ్యమంత్రిని కాల్చి చంపండి అనే ఉన్మాద పార్టీ కావాలా? రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న పార్టీ కావాలా? అని ప్రశ్నించారు.