ఆంధ్రప్రదేశ్‌

నంద్యాలలో మాదే విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: వెయ్యి మంది చంద్రబాబులు వచ్చినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా నంద్యాల ప్రజల మనస్సు మార్చలేరని, వైకాపా విజయం ఖాయమని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో టిడిపి నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఏదో విధంగా గెలవాలని అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. టిడిపికి మద్దతు ఇవ్వడం లేదని తటస్ధ వైఖరితో ఉంటామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించి మంచిపనిచేశారన్నారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ గంగుల ప్రతాప్ రెడ్డి టిడిపిలో పోతున్నారని, వైకాపాకు ఎదురుదెబ్బ అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ప్రతాప్ రెడ్డి వైకాపాలో ఎప్పుడు పనిచేయలేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాన్ని చంద్రబాబు పొగొట్టారని, హోదా లేకపోయినా ప్యాకేజీ వస్తుందని చెప్పారని, ప్రస్తుతం ప్యాకేజీని కూడా ఇవ్వడం లేదన్నారు.

.