ఆంధ్రప్రదేశ్
రాజమహేంద్రవరం మున్సిపాలిటీలో అగ్ని ప్రమాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 19 August 2017
రాజమహేంద్రవరం, ఆగస్టు 18: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలోని పరిపాలనా విభాగంలో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఎనిమిది కంప్యూటర్లు, రెండు ప్రింటర్లు దగ్ధమయ్యాయి. ఉద్యోగులకు సంబంధించిన 1500 వరకు రికార్డులు కాలిపోయాయి. విద్యుత్ షార్టు సర్వ్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించిందని గుర్తించారు. తెల్లవారుజామున పరిపాలనా విభాగం నుంచి మంటలు, పొగలు రావడం గమనించిన వాచ్మెన్ సమీపంలోనేవున్న అగ్ని మాపక కేంద్రానికి వెళ్ళి సమాచారం అందించడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. మేయర్ పంతం రజనీశేషసాయి, కమిషనర్ విజయరామరాజు, ఎమ్మెల్సీ అప్పారావు తదితరులు పరిశీలించారు.