ఆంధ్రప్రదేశ్‌

నేడు నంద్యాలకు సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 18: ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నుంచి రెండురోజులు నంద్యాలలో పర్యటించనున్నారు. ఈనెల 9వ తేదీ నుంచి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అక్కడే మకాం వేసి విస్తృత ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టిడిపి శ్రేణుల్లో ఉత్తేజం నింపేందుకు ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 10.30 గంటలకు నంద్యాల రూరల్ మండలం అయ్యలూరు బహిరంగసభతో ప్రారంభిస్తారు. ఉదయం 11.30 గంటలకు పొన్నాపురం నుంచి రోడ్‌షో మొదలై మధ్యాహ్నం 1.30 గంటలకు జనరల్ హాస్పటల్ మీదుగా ఎన్జీవో కాలనీ, మధ్యాహ్నం 3.30 గంటలకు గాంధీచౌక్ వద్ద జరిగే బహిరంగ సభలలో ప్రసంగిస్తారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు నడిగడ్డ, సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ షాదీఖానా, 6.30కు శ్రీనివాసనగర్ జంక్షన్‌లో రోడ్‌షో నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు సూరజ్ గ్రాండ్ సర్కిల్ వద్ద జరిగే బహిరంగసభలో ప్రచారం నిర్వహిస్తారని టిడిపి జాతీయ మీడియా కమిటీ కోఆర్డినేటర్ ఎల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ వివరించారు.