ఆంధ్రప్రదేశ్
కెసిఆర్తో జగన్ కుమ్మక్కు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 17 May 2016
విజయవాడ, మే 16: రాష్ట్ర విభజన తరువాత ఆస్తుల పంపకం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్యాయంగా వ్యవహరించినా, నదీ జలాల పంపకంలో ఆయన మొండిగా వ్యవహరిస్తున్నా మాట్లాడని జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయడం తగదని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు అన్నారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకునిగా జగన్ ఎప్పుడైనా బాధ్యతాయుతంగా వ్యవహరించారా? అని ప్రశ్నించారు. బాబు నిర్లక్ష్యం వల్లే తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్లు నిర్మిస్తోందని జగన్ అనడం హాస్యాస్పదమన్నారు. ఆ ప్రాజెక్ట్ల కాంట్రాక్ట్ పనులు జగన్ సన్నిహితులకు వచ్చాయని, ఇందులో జగన్కు ప్యాకేజీ అందడం వల్లనే కెసిఆర్ అన్యాయాలకు పాల్పడుతున్నా మాట్లాడ్డం లేదని ధ్వజమెత్తారు.