ఆంధ్రప్రదేశ్‌

వైశ్యులు వైఎస్ జగన్ మాటలు నమ్మరు: మంత్రి శిద్దా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఆగస్టు 21: వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామన్న జగన్ మాటలు నంద్యాల ప్రజలే కాదు, రాష్ట్రంలోని వైశ్యులెవరూ నమ్మే పరిస్థితిలో లేరని మంత్రి శిద్దా రాఘవరావు స్పష్టం చేశారు. ఆయన నంద్యాలలో మాట్లాడుతూ, అసలు అధికారంలోకి వచ్చే అవకాశమే లేని జగన్ కార్పొరేషన్ ఎలా స్థాపిస్తారని ప్రశ్నించారు. నంద్యాలలో వైసీపీ వైశ్య వర్గాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేసిందని, కానీ తాము వారికి వాస్తవాలు వివరించామని అన్నారు. వైశ్యులు టిడిపికి మూలస్తంభాలన్నారు. అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి కొనసాగుతుందన్న భావన వైశ్యులతోపాటు, వ్యాపారవర్గాలు వ్యక్తం చేయడం సంతోషకరమే కాకుండా విజయసంకేతమని వ్యాఖ్యానించారు.