ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో అక్షరధామ్ తరహా సంస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 28: ఢిల్లీ అక్షరధామ్ తరహాలో ఏపి రాజధాని అమరావతి నగర ప్రాంతంలోనూ ప్రతిష్ఠాత్మకంగా ఒక ఆధ్యాత్మిక సంస్థను నెలకొల్పేందుకు అనువైన 30 ఎకరాల స్థలం కేటాయించాలని అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ ప్రతినిధులు సోమవారం ఏపి సిఆర్‌డిఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్‌ని కల్సి కోరారు. తమ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆధ్యాత్మిక ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతిపాదనను ప్రతినిధులు వివరించారు. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ నివేదిక అందజేయాలని కమిషనర్ వారికి సూచించారు. నివేదిక వచ్చాక ప్రతిపాదనను పరిశీలిస్తామని కమిషనర్ వివరించారు.