ఆంధ్రప్రదేశ్‌

విచ్చలవిడిగా డబ్బు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 28: నంద్యాల ఉప ఎన్నికలో విజయం కోసం అధికారదర్పాన్ని ప్రయోగించి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం, తల్లిదండ్రులు లేని పిల్లలంటూ చేసిన ప్రచారం కారణంగానే టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి విజయం సాధించారని వైకాపా అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి అన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఆయన సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ నంద్యాలలో విజయం ప్రభుత్వానికి సానుకూల సంకేతమేమీ కాదని అభిప్రాయపడ్డారు. నంద్యాలలో గెలుపే లక్ష్యంగా అధికార దుర్వినియోగం, ఓటర్లను ప్రలోభపెట్టడం, భయభ్రాంతులకు గురిచేయడం కారణంగా తాము ఓడిపోయామని అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని, రానున్న ఎన్నికలకు మరింత చురుగ్గా పనిచేసి విజయానికి కృషి చేస్తామని అన్నారు.