ఆంధ్రప్రదేశ్
బాబుకు ఎన్జివో నేతల కృతజ్ఞతలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విజయవాడ, ఆగస్టు 29: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు ఏపి ఎన్జివో అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్బాబు నేతృత్వంలో పలువురు ఎన్జివో నాయకులు మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు నంద్యాల శాసనసభ ఉప ఎన్నికలో గెలుపొందడం పట్ల అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కారుణ్య నియామకాల్లో ఇంటర్మీడియట్ విద్యార్హతను కల్పించడం, కారుణ్య నియామకం అవసరం లేనివారికి ఎక్స్గ్రేషియాను పెంచడంతోపాటు మచిలీపట్నం, శ్రీకాకుళం, చిత్తూరు పట్టణాల్లో పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటి అద్దె భత్యాన్ని 20 శాతానికి, సిఆర్డిఏ పరిధిలో ఉచిత బస్ పాస్లు మంజూరు వంటి సానుకూల నిర్ణయాలను తీసుకున్నందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు అశోక్బాబు ముఖ్యమంత్రికి వివరించారు. ఏపిఎస్ఆర్టిసి నేషనల్ మజ్దూర్ యూనియన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 12 తేదీన విజయవాడలో నిర్వహించనున్న గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరుకావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పట్ల తమ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ఉంటుందన్నారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొంత జాప్యం జరిగినప్పటికీ ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉంటానన్నారు. ఎన్ఎంయు గోల్డెన్ జూబ్లీ వేడుకలకు తాను తప్పక హాజరవుతానని ముఖ్యమంత్రి ఉద్యోగ సంఘ నాయకులకు హామీ ఇచ్చారు.