ఆంధ్రప్రదేశ్‌

గోదావరికి శబరి వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 31: ఉపనది శబరి ఉగ్రరూపం దాల్చడంతో గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి నుంచి గురువారం సాయంత్రం 2.97 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెట్టారు. 10.30 అడుగుల నీటి మట్టాన్ని నిర్వహిస్తూ బ్యారేజి నాలుగు ఆర్మ్‌లలో మొత్తం 175 గేట్లను 0.60 మీటర్లకు ఎత్తి వరద జలాలను సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. కాటన్ బ్యారేజి జలాశయం మట్టం 13.81 మీటర్లు నమోదైంది. గోదావరి ఉప నది శబరికి వరద పోటు తగలడంతో ఆ నీరే గోదావరి నదిలో చేరుతోంది. శబరి ఉగ్రరూపం దాల్చడంతో తూర్పు గోదావరి జిల్లాలోని విఆర్ పురం, కూనవరం, చింతూరు మండలాల్లో ఎటుచూసినా జలమయంగానే కన్పిస్తోంది. అయితే ఎగువ ప్రాంతంలో గోదావరి వరద నీటిమట్టం నిలకడగా సాగుతోంది. భద్రాచలం వద్ద 26.10 అడుగులు నమోదైంది. కాళేశ్వరం వద్ద 5.75 మీటర్లు, పేరూరు వద్ద 7.51, దుమ్ముగూడెం వద్ద 7.95, కూనవరం వద్ద 9.78, కుంట వద్ద 6.73, కొయిదా వద్ద 12.79, పోలవరం వద్ద 8.79, రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ రైల్వే వంతెన వద్ద 14.06 మీటర్ల ప్రవాహ మట్టం నమోదైంది. కాటన్ బ్యారేజి నుంచి డెల్టాలకు 8700 క్యూసెక్కుల సాగు జలాలను విడిచి పెట్టారు. తూర్పు డెల్టాకు 2900 క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2300, పశ్చిమ డెల్టాకు 3500 క్యూసెక్కుల జలాలను విడిచి పెట్టారు.

చిత్రం..బ్యారేజీ నుండి సముద్రంలోకి విడిచిపెడుతున్న వరద జలాలు