ఆంధ్రప్రదేశ్‌

అంబులెన్స్ ఢీకొని దంపతుల మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కశింకోట, ఆగస్టు 31: విశాఖ జిల్లా కశింకోట వద్ద గురువారం అంబులెన్స్ ఢీకొట్టిన సంఘటనలో వృద్ధ దంపతులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కశింకోట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన కరకా రామునాయుడు, పైడితల్లి వ్యవసాయదారులు. గురువారం ఉదయం తమ పొలంలోకి వెళ్లి పనులు ముగించుకుని తిరిగి వస్తూ రోడ్డు దాటుతుండగా మద్యం మత్తులో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ ఎ.మురళీకృష్ణ నర్సీపట్నం నుండి తాళ్లపాలెం వైపు అతివేగంగా వస్తూ వీరిని ఢీ కొట్టాడు. దీంతో ఈ వృద్ధ దంపతులిద్దరూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందారు. ప్రమాద విషయం తెలుసుకున్న రూరల్ సిఐ రామచంద్రరావుహుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. అంబులెన్స్ డ్రైవర్ మురళీకృష్ణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కశింకోట పోలీసులు తెలిపారు.