ఆంధ్రప్రదేశ్‌

నేడు రాష్టప్రతి తిరుపతి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 31: భారతదేశ ప్రథమ పౌరుడు, రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం తిరుపతికి చేరుకోనున్నారు. రాష్టప్రతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా తిరుపతికి వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలుకడంతోపాటుగా గట్టి భద్రతా చర్యలు చేపట్టడంలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది. ఇందులో భాగంగా ఇప్పటికే తిరుమల, తిరుపతిలో ఆయన పర్యటించనున్న ప్రాంతాలను పోలీస్ అధికారులు తమ అదుపులోకి తీసుకున్నారు. తన తొలిరోజు పర్యటన మొత్తం తిరుపతిలోనే కొనసాగుతుండటం, రాత్రికి స్థానిక పద్మావతి అతిథిగృహంలో బస చేస్తుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అదే సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, గవర్నర్, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు సైతం రాష్టప్రతి పర్యటనలో భాగస్వాములు అవుతుండటంతో భద్రత విషయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.