ఆంధ్రప్రదేశ్‌

తిరుమలలో కుంభవృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 3: తిరుమలలో ఆదివారం కుంభవృష్టి కురిసింది. దీంతో రెండో ఘాట్ రోడ్డులో కొండచరియలోని మట్టిపెళ్లలు, చిన్నచిన్న బండరాళ్లు రోడ్డుపైకి జారిపడ్డాయి. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. బండరాళ్లు రోడ్డుపై పడినప్పటికీ వాహనచోదకులు జాగ్రత్తగా కొండపైకి చేరుకున్నారు. కాగా, సమాచారం తెలుసుకున్న టిటిడి అధికారులు వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. ఆదివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. అటు తరువాత తెరిపి ఇచ్చినప్పటికీ సాయంత్రం మరోమారు వర్షం కురిసింది. దీంతో కొండచరియలు చిన్నచిన్న రాళ్లు జారి రోడ్డుపైకి దొర్లుకుంటూ వచ్చాయి.

చిత్రం..తిరుమల రెండో ఘాట్‌లో ఆదివారం విరిగిపడిన కొండచరియలు