ఆంధ్రప్రదేశ్‌

నెల్లూరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రసాభాస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 21: నెల్లూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు రసాభాసగా మారాయి. పోలింగ్ ప్రారంభం కాకముందే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బ్యాలెట్ పేపరుపై అంకెలు వేయడంతో తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నికల అధికారి కమిషనర్ వెంకటేశ్వర్లు జోక్యం చేసుకుని నిబంధనల ప్రకారమే పోలింగ్ జరుపుతున్నామని చెప్పడంతో దీనిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మండిపడ్డారు. కమిషనర్‌కు వైఎస్‌ఆర్సీపీ సభ్యులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. మూకుమ్మడిగా పోలింగ్ జరిగే గదిలోకి తోసుకువచ్చి అక్కడ ధర్నా నిర్వహించారు. పరిస్థితి అదుపుతప్పుతోందని భావించిన పోలీసులు కమిషనర్‌ను అక్కడ నుంచి తీసుకుని వెళ్లిపోయారు. బ్యాలెట్ పేపరులో అంకెలను తొలగిస్తేనే ఓటింగ్‌లో పాల్గొంటామని వైకాపా సభ్యులు చెప్పడం, అందుకు అధికారులు ససేమిర అనడంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్ర ఆవేశానికి లోనై కమిషనర్‌పై దాడికి యతి నంచారు. పోలింగ్ అధికారులను బాయ్‌కాట్ చేస్తున్నామని చెప్పి బయటకు వెళ్లిపోయారు.