ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 22 May 2016
అనకాపల్లి, మే 21: ఆగివున్న లారీని ఢీకొట్టిన సంఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరు నర్సింగరావుపేట వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విశాఖపట్నం ఆరిలోవకు చెందిన మామా అల్లుళ్లు ఏలూరు వెళ్లి వస్తూ ఈ సంఘటనలో దుర్మరణం చెందారు. అదే కారులో ప్రయాణిస్తున్న విశాఖపట్నానికి చెందిన మరో ఇద్దరు కూడా మృతి చెందారు. విశాఖపట్నం ఆరిలోవకు చెందిన కసిరెడ్డి ముత్యాలు (60) ఆయన అల్లుడు కోనరేసు ప్రేమసాయిబాబు (41), విశాఖ షిప్యార్డులో డ్రైవర్గా పనిచేస్తున్న తలసాని రామ్మోహనరావు, తాడిబట్ల రాజారావు (50) ఈ ప్రమాదంలో మృతి చెందారు. అనకాపల్లి వందపడకల ఆసుపత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు.