ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 4: ప్రభుత్వంలోని అన్ని శాఖలు విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు. సచివాలయం 1వ బ్లాక్ సమావేశ మందిరంలో సోమవారం మధ్యాహ్నం విద్యుత్ బకాయిలు ఎక్కువగా ఉన్న ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై సమీక్షించారు. ముఖ్యంగా బకాయిలు ఎక్కువగా ఉన్న పంచాయతీరాజ్, నీటిపారుదల, మున్సిపల్, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖలు అక్టోబర్ 15 నాటికి మొత్తం చెల్లించాలని చెప్పారు. వివిధ శాఖలు తెలిపిన పలు సమస్యలకు సిఎస్ అక్కడికక్కడే పరిష్కార మార్గాలను వెల్లడించారు. బకాయిలు చెల్లించే విధానాలను కూడా సూచించారు. నాబార్డ్ నిధుల నుంచి విద్యుత్ బకాయిలు చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖను ఆదేశించారు. నిర్ణయించిన తేదీ లోపల బకాయిలు చెల్లిస్తామని ఆయా శాఖల అధికారులు సిఎస్‌కు హామీ ఇచ్చారు. విద్యుత్ చార్జీలను తగ్గించుకునే ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఎన్టీఆర్ జలసిరి పథకం కింద 17వేల సోలార్ పంపుసెట్లను సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయమని సిఎస్ ఆదేశించారు. వేస్ట్ టు ఎనర్జీ (వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి) ప్లాంట్లను కూడా త్వరగా నెలకొల్పడానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సోలార్ పంపుసెట్లు, వేస్ట్ టు ఎనర్జీ పనులు పూర్తి చేయడం ద్వారా విద్యుత్ ఆదా అవుతుందని, ఆ విధంగా వ్యయం తగ్గించుకోవచ్చని సిఎస్ చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ముద్దాడ రవిచంద్ర, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్, ఏపి ట్రాన్స్‌కో ఎండి కె.విజయానంద్, మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరి ఆర్.కరికాల వళవన్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కెఎస్ జవహర్‌రెడ్డి, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.