ఆంధ్రప్రదేశ్‌

బాలికపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, సెప్టెంబర్ 5: సభ్యసమాజం తలదించుకునేలా ఒ పాస్టర్ మైనర్‌బాలికపై అత్యాచారం జరిపిన ఘటన రేణిగుంట మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 55 సంవత్సరాల పాస్టర్ 11 సంవత్సరాల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలుసుకున్న స్థానిక మహిళలు గుంజకు కట్టేసి చితక్కొట్టారు. తరువాత పోలీసులకు అప్పగించారు. చిన్నారిని వైద్యపరీక్షలకు తరలించారు.విషయం తెలుసుకున్న మీడియా మంగళవారం పద్మానగర్‌లోని స్థానిక మహిళలను వివరణ కోరగా, పద్మానగర్ చర్చి సమీపంలో నివాసం ఉంటున్న ఒక బాలిక నీళ్లు పట్టుకోడానికి చర్చి వద్దకు రాగా సెల్వమణి ఆమెకు మాయమాటలు చెప్పి తన గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. తీవ్రకడుపునెప్పితో కుంటుకుంటూ నడుస్తున్న బాలికను చూసి స్థానికులు ప్రశ్నించగా విషయం తెలిసింది.